Dunna Veeraswamy Naidu

DUNNA VEERASWAMY NAIDU

కర్తవ్య నిర్వహణలో వీరాస్వామి చూపిన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా 1906 అసిస్టెంట్ ఇంజనీర్ నియమించింది. ఈ పదవిలో ఉన్నప్పుడు బెజవాడలో ఆంపిల్ హాస్పిటల్, తమ్మిలేరు వంతెన, జంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ వంతెన, బుడమేరు వంతెన మొదలగు కట్టడాలను నిర్మింపచేసి నెంబర్ వన్ ఇంజనీర్ గా పేరు గడించారు.

వాస్తుశిల్ప కళారీతుల్లో పాశ్చాత్య నైపుణ్యాన్ని గడించి ఆంధ్రదేశంలో కంచుకోటల్లాంటి భవనాలుఆనకట్టలను కట్టించి గొప్ప ఇంజనీర్ కీర్తి ప్రతిష్టలుపొందిన దున్నా వీరస్వామి నాయుడు నాగపూర్ సమీపంలోని జాలాలో 16 సంవత్సరంలో జన్మించారువీరస్వామి తండ్రి పిచ్చయ్య బ్రిటిష్సైన్యంలోని 42 రెజిమెంట్ సర్వేయర్గా పనిచేశారునాగపూర్జాలా మొదలగు ప్రాంతాల మీదుగా సర్వే చేస్తూ ఉద్యోగ ధర్మం నెరవేరుస్తూనేస్వర్గస్తులైనారుపిచ్చయ్య గారికి ఇద్దరు కుమారులుముగ్గురు కుమార్తెలు జన్మించారువీరిలో పెద్దవాడు మన దున్నా వీరాస్వామి నాయుడుబాల్యంలోనే తాతగాని స్వస్థలమైన బందరు వచ్చి విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేశారు.


బందరు నోబుల్ కళాశాలలో చదువు కునే సమయంలోనే గుంపిని నారాయణ స్వామి నాయుడు దగ్గర డ్రాప్ట్మెన్ గా శిక్షణ పొంది అటు తర్వాతపరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.1885 లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో డ్రాఫ్ట్స్ మెన్గా ఉద్యోగంలో చేరి రెండున్నర సంవత్సరాలు నెల్లూరుగుడివాడలలోపనిచేశారుఅనంతరం యస్.జి.ఎస్రైల్వే యం అండ్ యస్ యమ్ రైల్వేలో పనిచేసి వివిధ కట్టడాలనువంతెనలను నిర్మింపజేసి అధికారులుప్రశంసలు అందుకున్నారుఉద్యోగం చేస్తూనే 'సర్వేయింగ్ లెవెలింగ్ మొదలగు పరీక్షలలో ప్రథమ ర్యాంకులో ఉత్తీర్ణు లయ్యారు. 1890లో లోకల్ ఫండ్డిపార్ట్మెంట్ హెడ్ డ్రాఫ్ట్మెన్గా చేరి మూడవ తరగతి ఓవర్శీయర్గా పదోన్నతి పొంది ఆరు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారుకర్తవ్య నిర్వహణలోచూపిన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా వీరాస్వామిని 1906 అసిస్టెంట్ ఇంజనీర్ గా నియ మించింది పదవిలో ఉన్నప్పుడుబెజవాడలో అంపిల్ హాస్పిటల్తమ్మిలేరు వంతెనజంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ వంతెనబుడమేరు వంతెన మొదలగు కట్టడాలనునిర్మింపచేసి నెంబర్ వన్ ఇంజనీర్గా పేరు గడించారు.



1914
లో తాత్కాలిక ప్రాతిపదికన ఆక్టింగ్ జిల్లా బోర్డు ఇంజనీర్ గా కూడా పనిచేశారుఅనంతరం తన పూర్వపు ఉద్యోగమైన అసిస్టెంట్ ఇంజనీర్హోదాలో చిరకాలం పనిచేసి నాటి నిబంధనల మేరకు తన 55 ఏట పదవీ విరమణ చేశారువీరాస్వామి నాయుడు సేవలు అవసరమైఉన్నందున బ్రిటిష్ ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు ఉద్యోగ గడువు పొడిగించిందినాయుడు గారు తన 58 ఏట అనగా 1926లో పదవీవిరమణ చేశారుదున్నా వీరాస్వామి నాయుడు వివాహం 1892లో జీబు వెంకట్రా ములు నాయుడు ఆరవ కుమార్తె శ్రీమతి రాజ్యలక్ష్మి దేవమ్మతోజరిగింది దంపతులకు నరసింహారావు నాయుడుఆంజనేయులు నాయుడు అను ఇద్దరు కుమారులుఇద్దరు కుమార్తెలు జన్మించారువీరికుమార్తెను ముచ్చర్ల షావుకారు పరుచూరి వెంకయ్య నాయుడు కుమారుడు సూర్యనారాయణ నాయుడికి ఇచ్చి వివాహం జరిపిం చారువీరాస్వామినాయుడు తన ఇష్టదైవమైన రామాంజనేయ స్వామి వారికి మాచవరం గ్రామంలో గొప్ప దేవాలయం నిర్మించి తరించారు.


Post a Comment

Previous Post Next Post